17 Killed Fire Accident in Hyderabad CM Revanth Reddy Enquiry: హైదరాబాద్లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. అయితే 8 మంది మృతి చెందిన అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంలో ఓకే కుటుంబ సభ్యులు మృతి చెందడం బాధాకరమన్నారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం రేవంత్ భరోసా కల్పించారు. స్థానిక కుటుంబాలతో ఫోన్లో సీఎం పరామర్శించారు. మంటల్లో చిక్కుకున్న వారందరినీ కాపాడుతామని భరోసా ఇచ్చారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని చెప్పారు. దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఐజీ నాగిరెడ్డిని ఆదేశించారు.
ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై రాజకీయాలు చేయవద్దని కోరారు. ప్రమాదాలు చెప్పి రావని, ప్రమాదంలో గాయపడిన బాధితులను ఆదుకుంటామన్నారు.