Prime9

YS Jagan: టెన్త్‌ పరీక్షల నిర్వహణలో లోకేష్‌ ఫెయిల్: జగన్

YS Jagan:  కూటమి ప్రభుత్వంపై ఎక్స్‌ వేదికగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విమర్శలు ఎక్కుపెట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిలయ్యారని పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోందని విమర్శించారు.

 

పదవ తరగతి తప్పుడు ఫలితాలతో వేల సంఖ్యలో విద్యార్థులు అడ్మిషన్ల విషయంలో అన్యాయమైపోయారని ఆరోపించారు. వీటన్నిటీకీ ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలను వచ్చీరాగానే దెబ్బతీశారని మండిపడ్డారు.

 

ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదని.. రీవాల్యుయేషన్‌ ద్వారా తుది ఫలితాలు వచ్చే వరకూ కొన్ని రోజుల పాటు అడ్మిషన్లు నిలిపివేయాలని కోరారు. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో మొదలు, అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Exit mobile version
Skip to toolbar