Prime9

Droupadi Murmu: విశాఖకు రానున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

BreakingNews: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జూన్ 10న విశాఖ రానున్నారు. బీచ్ రోడ్‌లో జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను విశాఖ కలెక్టరేట్‌కు అధికారులు పంపించారు. జూన్ 10న ఉదయం పదకొండున్నర గంటలకు ద్రౌపదీ ముర్ము ప్రత్యేక విమానంలో డిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్తారు. అక్కడ జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి హాజరవుతారు. ఈ కార్యక్రమం తర్వాత ప్రత్యేక విమానంలో జార్ఖండ్ పర్యటనకు రాష్ట్రపతి వెళ్లనున్నారు.

Exit mobile version
Skip to toolbar