Minister Narayana Comments on TDR Bonds in AP Assembly: అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజు కొనసాగుతున్నాయి. ఈమేరకు జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సభ్యులు ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో భాగంగానే వైసీపీపై మంత్రి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయన్నారు.
ప్రధానంగా తణుకు, తిరుపతి , విశాఖపట్నంలలో భారీగా స్కామ్ జరిగిందని మంత్రి ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణకు ఆదేశించామని, రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీడీఆర్ బాండ్ల విషయంలో 3 నెలల్లో చర్యలు ఉంటాయని మంత్రి చెప్పారు.