Site icon Prime9

Nadendla Manohar : రేషన్‌ దుకాణాల ద్వారానే సరుకుల పంపిణీ.. డీలర్లు సిద్ధం కావాలి : మంత్రి నాదెండ్ల

Nadendla Manohar

Nadendla Manohar

Minister Nadendla Manohar holds review with Collectors and Civil Supplies Department officials : ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలు లేకుండా ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ చేపడుతుందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. శుక్రవారం విజయవాడలో కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు జూన్‌ 1వ తేదీ నుంచి డీలర్లు రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీకి సిద్ధం కావాలని ఆదేశించారు.

 

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా రేషన్‌ డీలర్లు పనిచేయాలని కోరారు. గతంలో కార్డుదారుల కుటుంబాలకు కుటుంబ పెద్దలా ఉన్న రేషన్‌ డీలర్లు ఇప్పుడు కూడా మనసుపెట్టి లబ్ధిదారులకు సేవలందించాలన్నారు. రేషన్‌ షాపుల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. సరైన తూకంతో సరుకులు పంపిణీ చేయాలన్నారు. ధరలు, స్టాక్‌ బోర్డు, పోస్టర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

 

దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటివద్ద సరుకులు పంపిణీ చేస్తామన్నారు. ప్రతినెల 1వ తేదీ నుంచి 15 వరకు ఆదివారాల్లో రేషన్ సరుకుల పంపిణీ పూర్తి చేయాలన్నారు. 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు దివ్యాంగులు, వృద్ధులకు సరుకులు పంపిణీ చేసేందుకు చొరవ చూపాలని సూచించారు. వాట్సప్ గ్రూపు ద్వారా ఎప్పటిక‌ప్పుడు స‌మాచారం అందించాలన్నారు. ఒక‌వేళ సాంకేతిక స‌మ‌స్యలు ఎదురైనా స‌రే కార్డుదారుల‌కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స‌రుకుల పంపిణీ జ‌ర‌గాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ-పోస్‌, వేయింగ్ మిషన్ల రిపేర్లకు సంబంధించి స‌ర్వీసు క్యాంపులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు.

Exit mobile version
Skip to toolbar