Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్కు చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో విజయసాయిరెడ్డిపై 506, 384, 420,109,467,120(b)రెడ్ విత్ 34 BNS సెక్షన్లు నమోదు చేశారు. ఈ నెల 12న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో వారు పేర్కొన్నారు. సీఐడీ జారీ చేసిన నోటీసులను విజయసాయిరెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసు ఏంటి, ఫిర్యాదు చేసిందెవరు?. అనేది నోటీసుల్లో ఇంకా స్పష్టత ఇవ్వలేదని సమాచారం.
Vijayasai Reddy : విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు
Vijayasai Reddy