Prime9

Accident in Kadapa: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 5గురు దుర్మరణం

5 Killed in Kadapa Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీకే దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో కారును లారీ ఢీకొంది. ఘాట్ రోడ్డులోని మూల మలుపు వద్ద వేగంగా వచ్చిన లారీ కారుపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి ఉన్నారు. వీరంతా రాయచోటి నుంచి కడపకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియలేదు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

 

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Exit mobile version
Skip to toolbar