Five Members Attack Corona Virus Cases In Eluru Collectorate: ఏపీలోని ఏలూరులో కరోనా కేసులు పెరగడంతో కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లాలోని కలెక్టరేట్లోని ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఐదుగురు సిబ్బందికి హోమ్ ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నారు. అయితే, కలెక్టరేట్లో ఐదుగురికి రావడంతో కార్యాలయంలో ఉన్న సిబ్బంది అందరికీ పరీక్షలు చేసేందుకు వైద్య బృందం సిద్ధమైంది.
ఇదిలా ఉండగా, దేశంలో మళ్లీ కరోనా గుబులు మొదలైంది. తాజాగా, కరోనా కేసులు 3వేలకు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఎక్కువగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 1,147 యాక్టివ్ కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 219, గుజరాత్లో 223 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.