CM Jagan: రేపు హైదరాబాద్ కు సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్ లో సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళులర్పించనున్నారు. జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు గచ్చిబౌలి స్టేడియం చేరుకుంటారు.

  • Written By:
  • Publish Date - November 15, 2022 / 08:10 PM IST

AP Cm Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్ లో సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళులర్పించనున్నారు. జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు గచ్చిబౌలి స్టేడియం చేరుకుంటారు. అక్కడ సూపర్‌స్టార్‌ కృష్ణ పార్ధివ దేహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 2.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

సూపర్ స్టార్ కృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీనిపై సీఎం జగన్ ట్విటర్‌ ద్వారా తన సంతాపం తెలిపారు. కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి, ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణ గారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని సీఎం జగన్‌ ట్వీట్ చేశారు.