AP CM Chandrababu meeting on Capital Amaravati: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో భాగంగా రాజధాని అమరావతి పనుల విషయంపై సమీక్ష ఉండనుంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12.45 నిమిషాలకు చంద్రబాబు సచివాలయానికి చేరుకుంటారు.
ఇందులో భాగంగా మధ్యాహ్నం 2.30 నిమిషాలకు కీలక ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో సీఆర్డీఏలో పలు అంశాలపై చర్చించిన తర్వాత రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ తర్వాత సాయంత్రం 6.30 నిమిషాలకు సీఎం చంద్రబాబు సచివాలయం నుంచి తిరిగి ఇంటికి వెళ్లనున్నారు.
ఇదిలా ఉండగా, రాజధాని అమరావతి పనుల కోసం ఇప్పటివకే బడ్జెట్లో నిధులు కేటాయించగా.. ఇప్పటికే కొంత నగదును సీఆర్డీఏకు బదిలీ చేసింది. అంతేకాకుండా రాజధాని కోసం మరో 40 వేల ఎకరాల భూసేకరణ అంశంపై చంద్రబాబు చర్చించనున్నారు. ఈ విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ సైతం పూర్తయింది. కావున ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది