AP Cabinet Meeting Today on Governance Review: ఏపీ కేబినెట్ నేడు సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది.ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అలాగే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులతో పాటు ఉద్యోగుల బదిలీలపై ఏపీ కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులపైనా కేబినెట్లో చర్చించనున్నారు. ఈ కేబినెట్లో ఎస్ఐపీబీ నిర్ణయాలపై చర్చించి ఆమోదం తెలపనుంది.
అంతేకాకుండా, 25 అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.33 వేల కోట్ల పెట్టుబడులు, ఏపీ లెదర్, ఫుట్ వేర్ పాలసీ 4.0 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే, ఎనర్జీ, ఐటీ, టూరిజం, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఉద్యోగావకాశాలు అందనున్నాయి. ప్రధానంగా భూ కేటాయింపులపై చర్చించనున్నారు.