Prime9

BioEthanol Plant: రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్‌, బయో ఇథనాల్‌ యూనిట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

Rajahmundry: గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్‌ యూనిట్‌ నిర్మాణ పనులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు శంకుస్థాపన చేశారు.

రాజమండ్రి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్‌ యూనిట్‌ ద్వారా రోజుకు 200 కిలో లీటర్ల బయో ఇథనాల్‌ ఉత్పత్తి అవుతుందని అంచన. గ్రీన్‌ఫీల్డ్‌ యూనిట్‌ ద్వారా పరోక్షంగా 400 మందికి, ప్రత్యక్షంగా 100 మందికి ఉపాధి లభించడమే కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ రైతులకు అదనపు ప్రయోజనం లభిస్తుందని చెప్పారు. పాడైపోయిన ఆహారధాన్యాలు, నూకలు, వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు వినియోగించి ఇథనాల్‌ను తయారు చేయడం ద్వారా రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు.

Exit mobile version
Skip to toolbar