Site icon Prime9

Veera Simhareddy : హెలీకాఫ్టర్‌లో బాలకృష్ణ.. ఒంగోలులో వీరసింహారెడ్డి ఎంట్రీ

balakrishna and sruthi haasan arrrived to ongole and pictures goes viral

balakrishna and sruthi haasan arrrived to ongole and pictures goes viral

Veera Simhareddy : నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నేడు అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నారు.

మొదట ఒంగోలులోని ఏఎంబీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ఏపీలో నెలకొన్న జీవో నెంబర్ 1 కారణంగా భారీ సభలకు పర్మిషన్ రిజెక్ట్ చేస్తుండటంతో వీరనరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్‌పై ఈ ప్రభావం పడింది. అయితే ఒంగోలులోని ఏఎంబీ గ్రౌండ్స్‌లో పలు కారణాల రీత్యా ఈ వేడుకకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు స్థలాన్ని మాత్రమే మారుస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. ఒంగోలులోని అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్‌లో వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు ఇప్పటికే భారీ ఏర్పాటరు చేసిన మేకర్స్ … అదిరిపోయే రేంజ్ లో వెదుకను చేస్తున్నారు. ఈ ఫంక్షన్ కి వచ్చే జనాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్నారులను, వృద్దులను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకురావొద్దని మూవీ టీమ్ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారనే ఊహాగానాలు కూయ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నందమూరి, మెగా ఫ్యామిలీ అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా ఇప్పటికే బాలకృష్ణ శృతి హాసన్ ఒంగోలు చేరుకున్నారు. బాలకృష్ణ హెలికాప్టర్ లో వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version
Skip to toolbar