Site icon Prime9

Hamas: మరో 11మంది బందీలను విడుదల చేసిన హమాస్

Hamas

Hamas

Hamas: ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య తాత్కాలిక సంధిని మరో రెండు రోజులు పొడిగించినట్లు మధ్యవర్తి కతార్ సోమవారం ప్రకటించింది.మరో 33 మంది పాలస్తీనా ఖైదీల విడుదలతో పాటుగా గాజా నుండి మరో 11 మంది బందీలను వదిలిపెట్టిన తరువాత సంధి పొడిగింపు జరిగింది.

33 మంది పాలస్తీనియన్ల విడుదల..(Hamas)

11 మంది ఇజ్రాయెల్ బందీలు, అందరూ మహిళలు మరియు పిల్లలు కావడం గమనార్హం. వీరు గాజా స్ట్రిప్‌లో సోమవారం రాత్రి హమాస్ బందిఖానా నుండి విడుదలయ్యారు. మంగళవారం తెల్లవారుజామున, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 33 మంది పాలస్తీనియన్లను విడుదల చేసి, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ నగరమైన రమల్లాకు తరలించారు.సోమవారం ఆలస్యంగా, 11 మంది బందీలు ఇజ్రాయెల్ చేరుకున్నారని ఆ దేశ సైన్యం తెలిపింది.వారు వారి కుటుంబాలతో తిరిగి కలిసే వరకు మా బలగాలు వారితో పాటు ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తం 11 మంది నిర్ ఓజ్ కిబ్బట్జ్‌కు చెందినవారు అని సంఘం తెలిపింది. బందీల రాకను ధృవీకరించిన కొద్దిసేపటికే, 33 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసినట్లు ఇజ్రాయెల్ జైలు అధికారులు తెలిపారు.

సోమవారం నాటికి విడుదలైన ఇజ్రాయెల్‌ల సంఖ్య 50కి చేరింది. ఇప్పటి వరకు 150 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ జైళ్ల నుంచి విడుదలయ్యారు.దాదాపు 240 మంది బందీలను హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 7 నాటి దాడిలో బంధించింది. ఇది యుద్ధానికి దారితీసింది. వీరిలో ఒకరిని ఇజ్రాయెల్ దళాలు విడిపించగా, ఇద్దరు గాజాలో చనిపోయారు.గాజాలోని హమాస్ నియంత్రణలో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 13,300 మంది పాలస్తీనియన్లు మరణించారు, వారిలో మూడింట రెండు వంతుల మంది మహిళలు మరియు మైనర్లు. ఇజ్రాయెల్‌లో దాదాపు 1,200 మంది మరణించారు.

Exit mobile version
Skip to toolbar