Prime9

Earthquake: ఖాట్మాండ్ లో భూకంపం

Kathmandu: ఖాట్మాండ్ లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. నేపాల్-చైనా సరిహద్దులోని సింధుపాల్ చౌక్ జిల్లాలో మద్యాహ్నం 2.52గంటలకు ఈ భూకంపం చోటుచేసుకొనింది. నేపాల్ కు 53 కి.మీ దూరంలో ఈ ఘటన జరిగిన్నట్లు తెలుస్తుంది.

భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఇండ్లు, కార్యాలయాల నుండి బయటికి పరుగులు తీశారు. భూకంపం ప్రభావం బీహార్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయని తెలుస్తుంది. గతంలో 2015లో కూడా భూకంపం నేపాల్ ను కుదిపేసింది. ఆనాడు రిక్టార్ స్కేలుపై 7.08 తీవ్రత చోటుచేసుకొనింది. అప్పట్లో భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చోటుచేసుకొని వున్నాయి.

ఇది కూడా చదవండి: Restaurant: చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు.. ఇవ్వకపోవడంతో రెస్టారెంట్‌కు నిప్పంటించేసాడు..

Exit mobile version
Skip to toolbar