Keerthy Suresh turning Producer soon: నిర్మాతగా మారనున్న కీర్తి సురేష్

జాతీయ అవార్డు గ్రహీత నటి కీర్తి సురేష్ తెలుగు, తమిళం మరియు మలయాళ భాషలలో చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో నాని యొక్క దసరా మరియు మెగాస్టార్ చిరంజీవి యొక్క భోళా శంకర్ షూటింగ్‌లో ఉంది . అంతేకాదు ప్రస్తుతం రెండు తమిళ ప్రాజెక్ట్‌లతో కూడా బిజీగా ఉంది.

  • Written By:
  • Publish Date - December 4, 2022 / 11:58 AM IST

Keerthy Suresh: జాతీయ అవార్డు గ్రహీత నటి కీర్తి సురేష్ తెలుగు, తమిళం మరియు మలయాళ భాషలలో చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో నాని యొక్క దసరా మరియు మెగాస్టార్ చిరంజీవి యొక్క భోళా శంకర్ షూటింగ్‌లో ఉంది . అంతేకాదు ప్రస్తుతం రెండు తమిళ ప్రాజెక్ట్‌లతో కూడా బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారంకీర్తి సురేష్ త్వరలో నిర్మాతగా మారడానికి రెడీ అవుతోంది.

మంచి కంటెంట్ ఆధారిత చిత్రాలను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. తన బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, కీర్తి సురేష్ స్క్రిప్ట్‌లు వింటోంది. ఆమె బృందం స్క్రిప్ట్‌లను ఫైనలైజఖ్ చేస్తోంది . తరువాత కీర్తి వాటిని చదువుతోంది. ఆమె మొదటి ప్రొడక్షన్ ప్రకటన వచ్చే ఏడాది జరిగే అవకాశముంది కీర్తి సురేష్ తండ్రి జి సురేష్ కుమార్ గతంలో పలు మలయాళ చిత్రాలను నిర్మించారు. కీర్తి సురేష్ ఇప్పుడు తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తోంది. ఆమె గతంలో అనేక మహిళా-కేంద్రీకృత చిత్రాలను చేసింది, అయితే దురదృష్టవశాత్తు, వాటిలో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద విజయవంతంకాలేదు. మరి కీర్తి సురేష్ నిర్మాతగా విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.