Prime9

Producer SKN: ఎగ్జిబిటర్ల వివాదం.. సినీ పరిశ్రమ ఐసీయూలో ఉంది: నిర్మాత ఎస్‌కేఎన్‌ కామెంట్స్‌

Baby Producer SKN Comments on Exhibitors Controversy: ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై బేబీ నిర్మాత ఎస్‌కేఎన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ప్రస్తుతం తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఐసీయూలో ఉందని, యాంటి బయాటిక్స్‌ ఇవ్వాల్సిన సమయమన్నాడు. ‘ఘటికాచలం’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాలో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ఆయన స్పందించారు.

 

కాగా గత కొద్దిరోజులుగా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పర్సంటేజీల విషయంపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజా ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు ఎస్‌కేఎన్‌. పర్సంటేజీల విధానంపై కాకుండా థియేటర్లలో ప్రేక్షకులు పర్సంటేజీ పెంచే విషయంపై సినీ పెద్దలు ఆలోచన చేయాలన్నాడు. టికెట్‌ ధరలు, తినుబండారాలు, ఓటీటీల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్నారు. సినీ పెద్దల మొదట దీనిపై దృష్టి పెట్టాలి. ఆపై ఓటీటీ వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. రెండు వారాల్లోనే ఎటూ ఓటీటీలోకి సినిమా వచ్చేస్తుంది అని ఆడియన్స్‌ అనుకుంటున్నారు.

 

ఈ అంశాన్ని సీరియస్‌గా పరిశీలించాలి. మార్నింగ్‌ షోలకు వచ్చే ఆడియన్స్‌ తగ్గిపోతున్నారు. కేవలం ఈవీనింగ్‌, వీకెంట్‌ షోలకు మాత్రమే ఆడియన్స్‌ థియేటర్లకు బాగా వస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించి మామూలు రోజుల్లో టికెట్‌ ధరలు తగ్గించడం, వీకెంట్స్‌ ధరలు పెంచడం వంటి విధానంపై ఆలోచన చేస్తే బెటర్‌ అనుకుంటున్నాను. బాలీవుడ్‌, కోలీవుడ్‌ సినిమా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తున్నాయి” అని ఆయన పేర్కొన్నాడు.

 

సినిమా థియటర్ల నిర్వాహణలో నస్టాలు వస్తున్నాయని, అద్దె ప్రతిపాదికన సినిమా ప్రదర్శించడం వల్లే తాము నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు అంటున్నారని, మల్టీప్లెక్స్‌ తరహా వచ్చే ఆదాయంలో తమకు పర్సంటేజీల విధానాన్ని అమలు చేయాలని సింగిల్‌ థియేటర్ల యాజమన్యాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అలా చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని వారంత నిర్మాతలకు లేఖ రాశారని చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్యవహరంపై చర్చలు జరుగుతున్నాయని, ఈ సమయంలో మీడియా కూడా సినీరంగానికి సహకరించాలని ఎస్‌కేఎన్‌ పిలుపునిచ్చాడు.

Exit mobile version
Skip to toolbar