Prime9

Gold seized at airport: శంషాబాద్ లో బంగారం పట్టివేత

Rajiv Gandhi Airport: సమాచారం మేరకు, దుబాయి నుండి హైదరాబాదుకు ఓ మహిళ ప్రయాణించింది. పేస్ట్ రూపంలోకి మార్చిన 268.4 గ్రాముల బంగారాన్ని వీపు వెనుక భాగాన అతికించుకొని తరలించే క్రమంలో ఆమె తనిఖీ సిబ్బందికి పట్టుబడింది. స్వాధీనం చేసుకొన్న బంగారం విలువ 13.73లక్షలుగా నిర్ధారించారు. చారణలో మహిళ ఉన్నట్లు సమాచారం.

బంగారాన్ని విదేశాల నుండి అక్రమంగా తరలించడం సర్వ సాధారణంగా మారింది. కొన్ని రోజుల కిందట ఓ ప్రభుత్వ అధికారి భార్య అక్రమంగా విజయవాడకు తరలిస్తూ పట్టుబడింది. ఇందుకోసం హైదరాబాదు నుండి ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టడం కూడా నాడు సంచలనంగా మారింది. తాజాగా ఇప్పుడు మరో మహిళ బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ హైదరాబాదులో పట్టుబడింది.

Exit mobile version
Skip to toolbar