Prime9

Swimming: చిత్తూరు జిల్లాలో విషాదం.. ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి

Three students died: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగంది. వి. కోట మండలం మోట్లపల్లి చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులంతా సరదాగా ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఓ విద్యార్థి నీటిలో మునిగిపోగా.. ఒకరి తర్వాత ఇంకొకరు కాపాడబోయి ముగ్గురు చనిపోయారు. చనిపోయిన విద్యార్థులను కుషాల్, నిఖిల్, జగన్ గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారిగా నిర్ధారించారు.

Exit mobile version
Skip to toolbar