Lucknow Player Digvesh Rathi Suspended by BCCI: ఐపీఎల్ 2025లో లక్నోకు బిగ్ షాక్ తగిలింది. సూపర్ జెయింట్స్ కీలక ప్లేయర్ దిగ్వేశ్ రాఠీని బీసీసీఐ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆయనపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. సన్రైజర్స్ హైదరాబాద్తో లక్నోతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మతో దిగ్వేశ్ వివాదానికి దిగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ జరుగుతుండగా.. దిగ్వేశ్ 8వ ఓవర్ వేస్తున్నాడు. అయితే అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడుతుండగా.. ఈ ఓవర్లో ముందకొచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు.
ఈ సమయంలో చేతితో సైగ చేయడంతో పాటు నోట్బుక్లో సంబరాలు చేసుకున్నాడు. దీంతో అభిషేక్ ఏదో అనగా.. వెంటనే దిగ్వేశ్ కోపంతో వచ్చి గొడవకు దిగాడు. వెంటనే అంపైర్లు రంగంలోకి దిగి ఇద్దరికి సర్ది చెప్పి పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మేరకు దిగ్వేశ్పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు అహ్మదాబాద్ వేదికగా మే 22న లక్నో, గుజరాత్ మధ్య జరిగే మ్యాచ్ నుంచి సస్పెండ్ చేసింది.