FIFA Suspends All India Football Federation: భారత్ ను సస్పెండ్ చేసిన ప్రపంచ ఫుట్ బాల్ పాలకమండలి

థర్డ్ పార్టీల నుండి మితిమీరిన ప్రభావం" కారణంగా భారతదేశాన్ని ప్రపంచ పుట్ బాల్ పాలక మండలి (ఫిఫా)మంగళవారం సస్పెండ్ చేసింది. అంతేకాదు అక్టోబర్‌లో జరగనున్న అండర్-17 మహిళల ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కును దేశం నుండి తొలగించింది.

  • Written By:
  • Publish Date - August 16, 2022 / 12:54 PM IST

FIFA Suspends All India Football Federation: థర్డ్ పార్టీల నుండి మితిమీరిన ప్రభావం” కారణంగా భారతదేశాన్ని ప్రపంచ పుట్ బాల్ పాలక మండలి (ఫిఫా)మంగళవారం సస్పెండ్ చేసింది. అంతేకాదు అక్టోబర్‌లో జరగనున్న అండర్-17 మహిళల ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కును దేశం నుండి తొలగించింది. 85 ఏళ్ల చరిత్రలో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్)పై ఫిఫా నిషేధం విధించడం ఇదే తొలిసారి. ఫిఫా చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించిన థర్డ్ పార్టీల నుండి అనుచిత ప్రభావం కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ( ఎఐఎఫ్ఎఫ్ )ని తక్షణమే సస్పెండ్ చేయాలని కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఫిఫా ఒక ప్రకటనలో తెలిపింది.

ఎఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారాలను స్వీకరించడానికి నిర్వాహకుల కమిటీని ఏర్పాటు చేయాలన్న ఉత్తర్వు రద్దు చేయబడి రోజువారీ వ్యవహారాలపై పూర్తి నియంత్రణను తిరిగి పొందిన తర్వాత సస్పెన్షన్ ఎత్తివేయబడుతుంది. గత ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరపనందుకు ఎఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా ప్రఫుల్ పటేల్ ను సుప్రీంకోర్టు తొలగించింది. ఎఐఎఫ్ఎఫ్ వ్యవహారాలను నిర్వహించడానికి మాజీ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి ఎఆర్ దవే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ( సిఒఎ)ని నియమించారు. సిఒఎ జాతీయ క్రీడల కోడ్ మరియు మోడల్ మార్గదర్శకాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించవలసి ఉంది.

జాతీయ సమాఖ్య ఎన్నికలను నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన కొన్ని రోజుల తర్వాత, ఎఐఎఫ్ఎఫ్ ను సస్పెండ్ చేస్తామని మరియు మహిళల U-17 ప్రపంచ కప్‌ను నిర్వహించే హక్కును తొలగిస్తామని ఫిఫా బెదిరించింది.