Site icon Prime9

Delhi, Punjab IPL 2025: నేడు ఐపీఎల్‌లో పంజాబ్‌తో ఢిల్లీ ఢీ.. ఇరు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్

Punjab Kings

Punjab Kings

Delhi Capitals, Punjab Kings IPL 2025: ఐపీఎల్ 2025లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ కాపిటల్స్ తలపడనుంది. ధర్మశాలలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పంజాబ్ 11 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిచి మూడింట ఓడింది. ఒక మ్యాచ్ వర్షం కారణంతో రద్దయింది. ఢిల్లీ కాపిటల్స్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఆరింటిలో గెలిచి 4 మ్యాచ్‌లలో ఓడింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ 3వ స్థానం, ఢిల్లీ 5వ స్థానంలో ఉన్నాయి.

 

ఈ సీజన్‌లో ఇప్పటివరకు దాదాపు అన్ని జట్లు పోరాడుతున్నాయి. ఇప్పటికే మ్యాచ్‌లు చివరి దశకు చేరుకోగా.. ఈ 18వ సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. దాదాపు అన్ని జట్లు 10 నుంచి 12 మ్యాచ్‌లు ఆడాయి. ఇక, 10 జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకున్నాయి.

అలాగే, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లే ఆఫ్స్ బెర్తు దాదాపుగా కన్‌ఫామ్ అయింది. ఇక, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీ పడుతున్నాయి. ఇందులో కోల్‌కతా అన్ని గెలిచినా ప్లేఆఫ్స్ వెళ్లాలంటే ఇతర జట్లు మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచి జరిగే ప్రతీ మ్యాచ్.. ఇతర జట్లపై ప్రభావం చూపింది. దీంతో అన్ని మ్యాచ్‌లు కీలకం కానున్నాయి.

 

ఇందులో భాగంగానే ఇవాళ పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ కీలకం కానుంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో 15 పాయింట్లతో టాప్ 3లో ఉన్న పంజాబ్.. ఈ మ్యాచ్‌ గెలిస్తే టాప్ 1లోకి దూసుకెళ్తుంది. ఒకవేళ ఢిల్లీ గెలిస్తే 3 లేదా 4వ స్థానం ఖరారు కానుంది. ఓటమి చెందితే మిగతా 2 మ్యాచ్‌లు ఢిల్లీ జట్టు తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. ప్రారంభంలో టాప్ 1లో ఉంటూ వచ్చిన ఢిల్లీ ఆ తర్వాత డీలా పడింది. మరి ఇవాళ గెలుస్తుందో లేదా చూడాలి మరి.

Exit mobile version
Skip to toolbar