Corona is booming in Singapore, Thailand and Bangkok: కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోంది. ఆసియా దేశాల్లో కరోనా మరోసారి కలకలం రేపుతోంది. ప్రధానంగా సింగపూర్, థాయ్లాండ్, బ్యాంకాక్ దేశాల్లో మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ వందలు, వేలాది కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మిగతా దేశాలకు కూడా కోవిడ్ విస్తరించే అవకాశాలు ఉన్నాయి. దీంతో భారత్ కూడా అప్రమత్తమైంది.
ఐదేళ్ల కింది..
ఐదేళ్ల కింద వచ్చిన మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. కరోనా తాకిడి తట్టుకోలేక, అనేక దేశాలు లాక్డౌన్ విధించాయి. దాదాపు రెండేళ్లపాటు ప్రపంచ దేశాలను కరోనా వణికించింది. అయితే ఆ తర్వాత కరోనా వైరస్ తనంతట తానే తగ్గుముఖం పట్టింది. దీంతో యావత్ ప్రపంచం రిలీఫ్ ఫీలైంది.
ఆసియాలో విజృంభన..
తాజాగా ఆసియాలో కరోనా జడలు విప్పుతోంది. ప్రధానంగా సింగపూర్, థాయ్లాండ్, బ్యాంకాక్ దేశాల్లో మరోసారి కరోనా కలవరపెడుతోంది. ఆయా దేశాల్లో రోజుకు వేలాది కేసులు నమోదవుతున్నాయి. ఇండియాలోను అక్కడక్కడ కేసులు నమోదవుతున్నాయి. భారత్లో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉంది.
ప్రజలెవరూ భయాందోళనలకు గురికావొద్దు..
కోవిడ్కు సంబంధించి ఫోర్త్ వేవ్ వస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే వార్తలను వైద్యరంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. వాక్సినేషన్ ప్రక్రియ సక్సెస్ ఫుల్ కావడంతో మెజారిటీ ప్రజల్లో ఇమ్యూనిటీని పెంచగలిగామన్నారు. కరోనా వైరస్ గురించి ప్రజలెవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు వైద్యరంగ నిపుణులు. మాస్క్లు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్ పాటించడంలాంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రధానంగా క్రానిక్ డిసీజెస్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైపర్ టెన్షన్, డయాబెటిస్, కిడ్నీ వ్యాధి సహా ఇతర దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు సాధ్యమైనంతవరకు ఇంటి నుంచి బయటకు రాకూడదని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. సహజంగా బస్సులు, రైళ్లు ప్రయాణిలకులతో కిటకిటలాడుతుంటాయి. ఈ పరిస్థితిలో మాస్క్ ధరించడం తప్పనిసరి అంటున్నారు వైద్యరంగ నిపుణులు. స్మోకింగ్ చేయకపోయినా, పొగ తాగే వారి పక్కన ఉన్నా డేంజరే అంటున్నారు డాక్టర్లు. వేరేవారు పొగ తాగుతున్నప్పుడు దానిని పీల్చినవారికి అంటే సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ కు ముప్పు ఉందంటున్నారు వైద్య రంగ నిపుణులు.