Road Accident : మహారాష్ట్రలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ.. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున మల్కాపూర్ పట్టణంలోని ఫ్లై ఓవర్‌పై చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ విషాద ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండడం మరింత విషాదాన్ని నింపింది.

  • Written By:
  • Publish Date - July 29, 2023 / 12:22 PM IST

Road Accident : మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున మల్కాపూర్ పట్టణంలోని ఫ్లై ఓవర్‌పై చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ విషాద ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండడం మరింత విషాదాన్ని నింపింది.  ప్రమాదానికి గురైన బస్సుల్లో ఒకటి అమర్‌నాథ్ యాత్ర ముగించుకుని హింగోలికి వెళ్తుండగా.. మరో ప్రైవేట్ బస్సు నాసిక్ వైపు వెళ్తోందని తెలుస్తుంది.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని గురుద్వారాలో ప్రథమ చికిత్స అందించారు. మృతి చెందిన వారిలో అమర్‌నాథ్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు. నాసిక్ వైపు వెళ్తున్న బస్సు ట్రక్కును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించి.. రెండో బస్సుకు ఎదురుగా రావడంతో ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.