Pakistan Stands on Kneel said by PM Narendra Modi: ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాదులను అంతం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాజస్థాన్లోని బికనీర్ నుంచి 103 అమృత్ భారత్ స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించారు. ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన తర్వాత దేశ ప్రజలంతా గర్వపడుతున్నారన్నారు. మన త్రివిధ దళాలు చక్రవ్యూహాలతో శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయని కొనియాడారు. భారత్లో రక్తపుటేర్లు పారించిన వాళ్లను ముక్కలు ముక్కలు చేశామన్నారు. ఉగ్రవాదులు 22 నిమిషాల్లో నరమేధం సృష్టించారన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా కేవలం 23 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టామని గుర్తు చేశారు. మన త్రివిధ దళాలు పాక్ను మోకాళ్ల మీద నిలబెట్టాయని తెలిపారు.
‘ఆపరేషన్ సింధూర్’ సమర్థ భారత రౌద్ర రూపమని ప్రధాని అన్నారు. పాకిస్థాన్ మనతో ఎప్పుడూ నేరుగా యుద్ధం చేయలేదన్నారు. ఎప్పుడూ దొంగదొబ్బే తీస్తుంటుందన్నారు. ఇక్కడ మోదీ ఉన్నాడన్న విషయం మర్చిపోయినట్లుందన్నారు. నా నరాల్లో రక్తం కాదు.. సింధూరం ప్రవహిస్తోందన్నారు. పాకిస్థాన్ నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు మన ఎంపీలు విదేశాలకెళ్లారు. పాకిస్థాన్ దేశం.. రాజస్థాన్ ఎయిర్ బేస్ను తాకలేకపోయిందన్నారు. ఐఏఎఫ్ మాత్రం వాళ్ల ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిందని తెలిపారు.