Site icon Prime9

Pm Modi: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. విదేశీ పర్యటన రద్దు

modi

modi

Russia tour: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యచరణపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సూపర్ కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు.

కాగా పహల్గామ్ దాడి అనంతరం పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం వాణిజ్య, దౌత్య పరంగా పలు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాగే పాకిస్తాన్ తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను తెంచుకుంది. మరోవైపు పాకిస్తాన్ విమానాలకు భారత గగన తలాన్ని కూడా మూసివేసింది. భారత్ లో ఉంటున్న ఆ దేశ పౌరుల అన్ని రకాల వీసాలను రద్దు చేసింది. వారంతా దేశాన్ని విడిచి వెళ్లాలని సూచించింది. అలాగే ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ను ఒంటరి చేసే ప్రయత్నాలు చేస్తోంది.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ మే 9 న రష్యా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై రష్యా విజయం సాధించిన సందర్భంగా రష్యా విజయోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు ప్రధాని మోదీ సహా పలు దేశాల అధినేతలను ఆహ్వానిస్తోంది. కానీ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆ దేశ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఆయన సమాచారం అందించారు. ఈ విషయాన్ని రష్యా అధికారులు నిర్ధారించారు.

కాగా పహల్గామ్ దాడి ఘటనకు సంబంధించి ప్రధాని మోదీ భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ప్రకటించారు. ఉగ్రవాదులను ఏక్కడ ఉన్నా వదిలే ప్రసక్తి లేదని ప్రకటించారు. మరోవైపు దీంతో దాయాది దేశం దాడి వెనుక తమ ప్రమేయం లేదంటూనే భారత సైనిక దళాలను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే సరిహద్దులకు సైనిక బలగాలను మొహరిస్తోంది.  యుద్ధం వస్తే ఎదుర్కోవాలని చూస్తోంది.

Exit mobile version
Skip to toolbar