Mass Suicide : సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు.. ఎందుకు, ఎక్కడంటే ?

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. ఈ హృదయవిదారక ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో తల్లిదండ్రులతో పాటు కొడుకు మృతి చెందగా కూతురు చికిత్స పొందుతోంది. అయితే వీరు ఆత్మహత్య

  • Written By:
  • Publish Date - August 12, 2023 / 07:01 PM IST

Mass Suicide : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. ఈ హృదయవిదారక ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో తల్లిదండ్రులతో పాటు కొడుకు మృతి చెందగా కూతురు చికిత్స పొందుతోంది. అయితే వీరు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సామూహిక ఆత్మహత్యాయత్నం ఘటన గుజరాత్ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ ఘటనలో ఇప్పటి వరకు తెలిసిన వివరాల ప్రకారం..  వికాస్ దుధాత్రా, హీనా దుధాత్రా, మనన్ దుధాత్రా మృతి చెందగా.. కుతూరు హ్యాపీ దుధాత్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇదిలా ఉండగా.. విషం తాగిన తర్వాత వికాస్ తన స్నేహితుడికి ఫోన్ చేసి.. తాను విషం తాగినట్టు తెలియజేశాడని వికాస్ సన్నిహితుడు ప్రదీప్ సవాలియా తెలిపారు. కాల్ అందుకున్న వెంటనే ప్రదీప్ సంఘటనా స్థలానికి చేరుకుని అత్యవసర సేవలను కూడా సంప్రదించాడు. విషయం తెలియగానే పోలీసు కాన్వాయ్ ఆసుపత్రికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు. అయితే.. వారు ఆత్యహత్యకు పాల్పడటానికి గల కారణాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి.