Prime9

Shahid Afridi : కేరళ ఈవెంట్‌లో పాక్ క్రికెటర్ అఫ్రిదికి రాచమర్యాదలు.. సిగ్గు లేదని నెటిజన్లు ఫైర్

Pakistan cricketer Afridi at Kerala Event : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పట్ల భారతీయులు కోపంతో రగిలిపోతున్నారు. భారత్‌లోనే కాదు.. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా పాక్‌ను బహిష్కరించారు. పాకిస్థాన్‌కు సాయం చేసిందన్న కారణంతో టర్కీని కూడా బ్యాన్ చేశారు. అలాంటిది పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి కేరళకు చెందిన కొందరు ఘన స్వాగతం పలికారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ సైన్యంపై అఫ్రిది నోరు పారేసుకున్నారు. సిగ్గులేకుండా కేరళ వంటకాలను రుచి చూశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

దుబాయ్‌లో ఉంటున్న కేరళకు చెందిన కొందరు ఇటీవల ఓ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. ఫంక్షన్‌కు పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అంతేకాదు.. అతడికి రాచమర్యాదలు కూడా చేశారు. భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ అఫ్రిదిని కేరళకు పిలవడం సిగ్గుచేటు. రాచమర్యాదలు చేసి అతడికి కేరళ ఆహారాన్ని అందించి పక్కన నిలబడి ఫొటోలు దిగారు. కేరళ వ్యక్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురయ్యారు. దుబాయ్‌లోని కేరళ సొసైటీని నెటిజన్లు తప్పుబడుతూ పోస్టింగ్‌లు పెడుతున్నారు.

 

షాహిద్ అఫ్రిది ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసు. ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడిన అతడికి కేరళ వ్యక్తులు స్వాగతం పలకడమేందని నెటిజన్లు మండిపడుతున్నారు. భారత సైన్యాన్ని అవమానించిన వ్యక్తిని కేరళకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం భారత్ పరువు తీశారంటూ విమర్శిస్తున్నారు. కేరళ సొసైటీ చేసింది తప్పేనని నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. దేశానికి మీరు మంచి చేయకపోయినా పర్లేదు.. కానీ, ఇలాంటి తప్పుడు పనులు చేసి భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని గట్టిగానే గడ్డిపెడుతున్నారు.

Exit mobile version
Skip to toolbar