Site icon Prime9

Encounter: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఎనిమిది మావోలు మృతి

bijapjur

bijapjur

Chattisgarh: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఉసూర్ ప్రాంతంలోని లంకపల్లె సరిహద్దులోని అడవుల్లో ఇవాళ మావోయిస్టులకు, పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఎనిమిది మంది మావోలు మృతిచెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న ఉన్నట్టు సమాచారం. ఇతనిపై రూ. కోటి రివార్డు ఉన్నట్టు తెలుస్తోంది.  కాగా మృతుల్లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ కూడా చనిపోయాడని భద్రతా బలగాలు వెల్లడించాయి.

 

మరోవైపు కర్రెగుట్టలో మావోయిస్టుల ఆచూకీ కోసం కూంబింగ్ కు వెళ్లిన పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కాగా చనిపోయిన పోలీసుల మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన జవాన్లను శ్రీధర్, సందీప్, పవన్ కల్యాణ్ గా గుర్తించారు. పేలుడులో తీవ్రంగా గాయపడిన ఆర్ఎస్ఐ రణధీర్ ను చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. చనిపోయిన జవాన్ల పార్థీవ దేహాలను చూసేందుకు డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టిఫెన్ రవీంద్ర వరంగల్ రానున్నారు.

Exit mobile version
Skip to toolbar