mega888 New Criminal Law: ఢిల్లీ పోలీసులు సోమవారం, జూలై 1న కమలా

New Criminal Law: కొత్త క్రిమినల్ చట్టం ప్రకారం మొదటి కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

ఢిల్లీ పోలీసులు సోమవారం, జూలై 1న కమలా మార్కెట్ ప్రాంతంలో వీధి వ్యాపారిపై భారతీయ న్యాయ సంహిత నిబంధనల ప్రకారం మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.మూడు కొత్త క్రిమినల్ చట్టాలు సోమవారం అమలులోకి వచ్చాయి.

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 05:29 PM IST

New Criminal Law: ఢిల్లీ పోలీసులు సోమవారం, జూలై 1న కమలా మార్కెట్ ప్రాంతంలో వీధి వ్యాపారిపై భారతీయ న్యాయ సంహిత నిబంధనల ప్రకారం మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.మూడు కొత్త క్రిమినల్ చట్టాలు సోమవారం అమలులోకి వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) మరియు భారతీయ సాక్ష్యా అధినియం (BSA) వరుసగా వలసరాజ్యాల కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను భర్తీ చేశాయి.

సిబ్బందికి శిక్షణ..(New Criminal Law)

మూడు కొత్త చట్టాల ప్రకారం ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడం ప్రారంభించారని కమిషనర్ సంజయ్ అరోరా ధృవీకరించారు. BNS యొక్క సెక్షన్ 285 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది,న్యూఢిల్లీ స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఫుట్ ఓవర్‌బ్రిడ్జి వద్ద వస్తువులను విక్రయించడానికి దారిని అడ్డుకున్న వీధి వ్యాపారిపై తెల్లవారుజామున ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారుజప్తులను రికార్డ్ చేయడానికి ఇ-ప్రమాన్ యాప్‌ను ఉపయోగించారని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ నిర్వహించే ఈ యాప్ తదుపరి విచారణ కోసం నేరుగా పోలీసు రికార్డులకు కంటెంట్‌ను అందజేస్తుందని ఒక అధికారి తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఢిల్లీ పోలీసులు కొత్త క్రిమినల్ చట్టాలపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.