Coronavirus Updates: దేశంలో 50 వేలకు చేరిన యాక్టివ్ కరోనా కేసులు

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారతదేశంలో ఒకే రోజు 5,379 కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు పెరిగాయి. దీనితో కోవిడ్ -19 కేసుల సంఖ్య 4,44,72,241 కు చేరుకుంది. యాక్టివ్ కోవిడ్ కేసులు 50,594కి తగ్గాయి. 27 మరణాలతో కోవిడ్ మరణాల సంఖ్య 5,28,057కి చేరుకుంది.

  • Written By:
  • Publish Date - September 7, 2022 / 03:18 PM IST

New Delhi: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారతదేశంలో ఒకే రోజు 5,379 కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు పెరిగాయి. దీనితో కోవిడ్ -19 కేసుల సంఖ్య 4,44,72,241 కు చేరుకుంది. యాక్టివ్ కోవిడ్ కేసులు 50,594కి తగ్గాయి. 27 మరణాలతో కోవిడ్ మరణాల సంఖ్య 5,28,057కి చేరుకుంది. ఇందులో కేరళలో 11 మరణాలు నమోదయ్యాయి. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.11 శాతం ఉండగా, జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.70 శాతానికి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. యాక్టివ్ కోవిడ్ కేసులకు సంబంధించి 24 గంటల వ్యవధిలో 1,742 కేసులు తగ్గుముఖం పట్టాయి.

భారత్ బయోటెక్ రూపొందించిన ఇంట్రానాసల్ కోవిడ్ -19 వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) మంగళవారం అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేసింది.