Site icon Prime9

CM Revanth Reddy : గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy : తనకు గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉందని, ప్రతిఒక్కరికీ ఫొటోలు దిగి చూపించాల్సిస అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీలో నియోజకవర్గాల డీమిలిటేషన్, త్రిభాషా అంశాలపై ఆయన తమిళ మంత్రి కేన్ నెహ్రూ, డీఎంకే ఎంపీ కనిమొళి, డీఎంకే నేతతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన ప్రతిపక్ష నేత ఫామ్‌‌హౌజ్‌కే పరిమితం అవుతున్నారని కామెంట్ చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని కోరారు. అధికార, విపక్షం కలిస్తేనే ప్రభుత్వమన్నారు.

తనకు రాహుల్ గాంధీకి మధ్య విబేధాలు తలెత్తాయని, ఢిల్లీకి వస్తే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు వదంతలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. తనకు గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉందని స్పష్టం చేశారు. ఆ విషయంలో ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు. తను ఎవరో తెలియకుండానే పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా, తెలంగాణకు సీఎంని చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ నాయకులు అడ్డం పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

తాను ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు నిధులు అడగడం లేదని, ఆర్ఆర్ఆర్, మెట్రో, మూసీ సుందరీకరణకు నిధులు అడుగుతున్నానని సమాధానం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో తాను చేసినన్నీ పాలసీలు ఎవరూ చేయలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తెలంగాణకు రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్లు వివరించారు. 8.8 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటును 6.1 శాతానికి తగ్గించామని తెలిపారు. తెలంగాణతోపాటు సౌత్ ఇండియాకు నష్టం కలిగించే నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెంటనే స్పందించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

తెలంగాణలో ‘భారత్ సమ్మిట్’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సుమారు 60 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సమ్మిట్ కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తదితరులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. భారత్ సమ్మిట్‌కు కేంద్రం క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందని, ఆ విషయంపైనే విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కలుస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగనున్నాయని, నెల రోజులపాటు దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయన్నారు. పోటీల కోసం రెండు రోజుల్లో అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Exit mobile version
Skip to toolbar