CJI Justice BR Gavai : అన్నీ వ్యవస్థల కంటే భారత రాజ్యాంగమే సర్వోన్నతమైనదని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. మూలస్తంభాలుగా ఉన్న వ్యవస్థలన్నీ కలిసి పనిచేయాలన్నారు. 52వ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇవాళ మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భారత్ పురోగతి సాధించడమే కాకుండా ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు.
న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థ, పార్లమెంట్ కంటే భారత రాజ్యాంగమే సర్వోన్నతమైనదని అన్నారు. మూలస్తంభాలుగా ఉన్న మూడు విభాగాలు రాజ్యాంగం ప్రకారం కలిసి పనిచేయాలన్నారు. ఇందులోని అన్ని వ్యవస్థలు సహకారం అందించుకుంటూ పరస్పరం గౌరవించుకోవాలని కోరారు. రాజ్యాంగ మౌలిక స్వరూపం పటిష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తాను గతంలో ఇచ్చిన 50 కీలక తీర్పులతో రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
మహారాష్ట్రకు చెందిన జస్టిస్ గవాయ్ సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రాష్ట్రంలో పర్యటించారు. బీఆర్ అంబేద్కర్ స్మారకమైన చైత్యభూమి సందర్శించి నివాళులర్పించారు.