Prime9

Monsoon: చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. నాలుగు రోజులు భారీ వర్షాలు

Telangana: రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నిన్నటితో రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. కాగా సోమవారం రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు 2 రోజుల్లోనే రాష్ట్రమంతా విస్తరించాయి. దీంతో రాష్ట్రమంతా వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాలు యాక్టీవ్ గా ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన బలపడిందని, ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. అలాగే ఇవాళ పలు జిల్లాల్లో అతి భారీవర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

 

ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగాం, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు, గద్వాల, నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో వచ్చే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతోపాటు బలమైన ఈదురుగాలులతో వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది.

 

Exit mobile version
Skip to toolbar