Miss World Contestants At Gachibowli Stadium: మిస్ వరల్డ్ భామలు తెలంగాణంతా చుట్టేస్తున్నారు. తొలుత చార్మినార్, చౌమహల్లా ప్యాలస్ సందర్శించిన మిస్ వరల్డ్ భామలు.. ఆ తర్వాత వరంగల్ వెయ్యి స్థంభాల గుడి, యాదగిరిగుట్ట, పోచంపల్లి చీరల కేంద్రం, పాలమూరు పిల్లలమర్రి కేంద్రాలు, ఎకో పార్కు, ఏఐజీ తదితర ప్రాంతాలను సందర్శించారు.
తాజాగా, ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న స్పోర్ట్స్ ఫైనల్స్కి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. క్రీడాకారులు తాంగ్ -త మార్షల్ ఆర్ట్స్ , రోలర్ స్కేటింగ్ ప్రదర్శన చేశారు. కాగా, మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ యోగాసనాలు చేశారు. అనంతరం బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు.
మొత్తం 10 విభాగాలకు చెందిన స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాతో పాటు మిస్ వరల్డ్ ఫౌండర్ జూలియా మోర్లీ, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాల, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ మల్లారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ టూరిజం హనుమంత్ పాల్గొన్నారు.