Site icon Prime9

Minister Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం.. 11 విభాగాల సమన్వయంతో ఆపరేషన్

Minister Uttam Kumar Reddy comments on SLBC Tunnel Accident: ప్రతిపక్షాలు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి దేశంలోనే టన్నెల్ అంశంలో అత్యున్నత నైపుణ్యం గల నిపుణులు ఉన్న ఆర్మీతో చర్చించామని చెప్పారు. బుధవారం టన్నెల్‌ను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.

కొనసాగుతున్న ఆపరేషన్..
ఫిబ్రవరి 22 ఉదయం కూలిపోయిన టన్నెల్‌లో ఎనిమిది మంది చిక్కుకున్నారని, ఈ ఘటన జరిగిన మూడు గంటల్లోనే తాను ఇక్కడికి వచ్చానని ఆరోజు నుంచి ఇప్పటి వరకు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశ సరిహద్దులో టన్నెల్ నిర్మించిన TBM నిపుణులను టన్నెల్ లోపలకు పంపి రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశామని అన్నారు. 200 మీటర్ల వరకు మట్టి, నీరు కలిసి పేరుకుపోవటంతో ఆపరేషన్ ఆలస్యమవుతోందని మంత్రి తెలిపారు.

మార్కోస్ మీదనే ఆశలు..
కాగా, బుధవారం ఇండియన్ మెరెయిన్ కమాండో ఫోర్స్ చేరింది. నేల, నీరు, ఆకాశంలో రెస్క్యూ కార్యక్రమాలు చేపట్టే ఈ టీమ్ రాకతో ప్రమాదంలో ఉన్నవారు బయటపడతారని అందరూ భావిస్తున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, నేవీ, రాట్ హోల్ మైనింగ్.. ఇలా 11 విభాగాలు సమన్యయంతో ఈ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రకృతి వైపరిత్యాన్ని రాజకీయంగా లబ్ధి పొందాలని భావించే వారి గురించి తానేమీ మాట్లాడలేనని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు అలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు.

Exit mobile version
Skip to toolbar