Prime9

Breaking News: తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు

Breaking News: తెలంగాణలో మందుబాబులకు షాకింగ్ న్యూస్, మద్యం ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఫుల్ బాటిల్ 40 రూపాయలు, హాఫ్ బాటిపై రూ.20, క్వార్టర్ పై రూ.10 పెంచేందుకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్లు పంపించారు. పెరిగిన ధరలు ఈ రోజు అర్థరాత్రినుంచే అందుబాటులోకి రానున్నాయి.

 

ఇటీవలే బీర్ల ధరలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లిక్కర్ ధరలు పెంచింది. దీంతో మందుబాబుల జేబులకు మరింత చిల్లు పడింది. గతంలో కంటే లిక్కర్ అమ్మకాలు కాస్త నెమ్మదించినట్లుగా కనిపిస్తోంది.

 

ఎండలు మండుతుండటంతో బీర్లకు డిమాండ్ భారీగా ఉండనుంది. చల్లని బీర్ తో సేదతీరేందుకు ఆసక్తిచూపుతున్నారు మందు ప్రియులు. సాధారణ రోజులతో పోలిస్తే ఎండాకాలం అమ్మకాలు పెరిగాయని అంటున్నారు వ్యాపారులు.

Exit mobile version
Skip to toolbar