Prime9

TG Intermediate Supply Exams: నేటి నుంచే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. 5 నిమిషాల సడలింపు

Telangana Intermediate Supplementary Exams from Today: తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇక సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కాగా విద్యార్థులకు ఇప్పటికే హాల్ టికెట్లు జారీ అయ్యారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.

 

తర్వాత వచ్చిన విద్యార్థులకు అనుమతిలేదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలు మే 29 వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4.2 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందుకోసం 892 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇప్పిటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టు బోర్డు కార్యదర్శి కృష్ణి ఆదిత్య చెప్పారు. ఇక పరీక్షల జవాబు పత్రాల ముల్యాంకనం రెండు విడతల్లో చేపట్టనున్నారు. మే 29 నుంచి మొదటి విడత ముల్యాంకనం చేయనున్నారు. మే 31 నుంచి రెండో విడత ముల్యాంకనం ప్రారంభకానుంది.

Exit mobile version
Skip to toolbar