Gulzar House – Human Rights: హైదరాబాద్లోని గుల్జార్హౌస్ అగ్నిప్రమాదం ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. సుమోటోగా కేసు నమోదు చేసుకొని విచారణకు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నగర సీపీ, ఫైర్ డీజీ, TSSPDCLకు నోటీసులు జారీ చేసింది. జూన్ 30వ తేదీలోగా ప్రమాదంపై సమగ్ర విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. గుల్జారి హౌస్ అగ్ని ప్రమాదం సంఘటనలో 17 మంది చనిపోయారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సరైన విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు.
మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. భవనంలో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల సమయంలో గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో అకస్మాత్తుగా మంటలతో పాటు దట్టంగా పొగ అలుముకుంది. దీంతో ఆ భవనం మొదటి అంతస్తులో నివాసముంటున్న నగల వ్యాపారి కుటుంబం, వారింటికి వచ్చిన బంధువులు ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయారు.