Fish Medicine Distribution in Nampally: జూన్ 8న మృగశిర కార్తె సందర్భంగా వచ్చేనెల 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేసే కార్యక్రమంపై బేగంబజార్ పోలీసులతో నిన్న సమావేశం నిర్వహించారు. సమావేశానికి డీసీపీ శిల్పవల్లితో పాటు 21 విభాగాల అధికారులు పాల్గొన్నారు.
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని డీసీపీ అధికారులను ఆదేశించారు. శాఖల వారిగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు. అలాగే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. చేప ప్రసాదం కోసం వచ్చే పేషంట్లకు సహాయంగా ఉండాలని తెలిపారు. కాగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే చేప ప్రసాదం పంపిణీ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. దూర ప్రాంతాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా చేపమందు కోసం పెద్ద సంఖ్యలో పేషంట్లు వస్తుంటారు.