Site icon Prime9

YS Jagan : ప్రజలను మోసం చేయటం చంద్రబాబుకు అలవాటే : వైఎస్ జగన్

YS Jagan

YS Jagan

YS Jagan : రెండు బడ్జెట్లలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలను మోసం చేశారని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్‌పై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగం ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని ఆరోపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు. గత అసెంబ్లీలో టీడీపీ సభ్యులు పది మందిని లాక్కోకుండా బాబుకు ప్రతిపక్ష హోదా తానే ఇచ్చినట్లు గుర్తుచేశారు. తమ వాళ్లు అయితే పది మంది టీడీపీ ఎమ్మెల్యేలను లాగేద్దామని పేర్కొన్నారు.

ప్రజలను మోసం చేయటం అలవాటే..
ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు రెండు బడ్జెట్లలోనూ ప్రజలను మోసం చేయడం ప్రస్ఫుటంగా కనిపిస్తుందని చెప్పారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అన్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రతీ ఇంటికి కరపత్రాలు పంచారని పేర్కొన్నారు. అన్ని శాఖల కేటాయింపులు అరకొరగానే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. గతేడాది బడ్జెట్‌లో కూడా 7200 ఇవ్వాల్సిన భృతి ప్రస్తావన లేదన్నారు. ఈ ఏడాది కూడా భృతి ప్రస్తావన లేదన్నారు. గవర్నర్ ప్రసంగం బుక్‌లో పచ్చి అబద్ధాలు రాశారని ఆరోపించారు. గవర్నర్ పేరుతో ప్రచురితం అయిన పుస్తకం బడ్జెట్ జరిగేటప్పుడే రెండవ సోషియో ఎకనామిక్ సర్వే అంటూ విడుదల చేశారని, 2024 -25లో 27,07,752 ఉద్యోగాలు ఇచ్చామని అందులో రాయడం సిగ్గుచేటన్నారు. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

బాబాది దగ, మోసం, వంచన..
పిల్లలకు ఇప్పటికే రూ.72 వేలు ఒక్కొక్కరికీ ఇవ్వాలని, దగ, మోసం, వంచన ఇలా అన్నీ బాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఉన్న ఉద్యోగాలు వరుసపెట్టి పీకేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లో లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఆప్కాస్ ద్వారా మరో లక్షా ముప్పై వేల ఉద్యోగాలు, రెండు లక్షల మందికి పైగా వాలంటీర్లు ఇచ్చామన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వం ఉద్యోగాలు 6,31,310 ఇచ్చినట్లు తెలిపారు. తాము చెప్పేది గారడీ లెక్కలు కాదని, వీళ్ల ప్రకారమే సోషియో ఎకనామిక్ సర్వేలోని డేటా ఇది అన్నారు. ఐదేళ్లలో 40,13,552 ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆధార్ నంబర్‌తో సహా చెబుతామని జగన్ పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar