Breaking News: శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నీలం జూట్ మిల్ సమీపంలోని జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. గ్రానైట్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో గ్రానైట్ బ్లాక్ లారీ క్యాబిన్ పై పడింది. లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుని మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సుతో సహా నాలుగు లారీలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.