Prime9

Simhachalam: సింహాచలం ఘటన దురదృష్టకరం: ఎమ్మెల్యే గంట

Simhachalam: సింహాచలం సంఘటన దురదృష్టకరమన్నారు భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాస్. గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిందని.. మృతిచెందిన వారి కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధి కల్పిస్తామన్నారు.

 

ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ విచారణ చేస్తుందన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన జగన్.. ప్రభుత్వం చేసిన హత్యలు అని నొక్కి నొక్కి చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి రూపాయలు పరిహారం ఎందుకు ఇవ్వలేదని జగన్ మాట్లాడడం పరిహాసంగా ఉందని కామెంట్ చేశారు. తాను మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తానని జగన్ చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు గంటా శ్రీనివాస్.

 

సింహాచలం ఆలయంలో ప్రమాదంపై త్రిసభ్య కమిషన్‌ ప్రాథమిక నివేదిక సిద్ధం చేయనుంది. రెండుసార్లు ఘటనాస్థలాన్ని పరిశీలించిన కమిషన్‌.. అధికారులు, శాఖల మధ్య సమన్వయలోపం గుర్తించింది. అలాగే నిర్మాణంలో నాసిరకం, పర్యవేక్షణ లోపం ఉందని విచారణలో తెలుసుకుంది. చందనోత్సవం కోసం హడావుడిగా గోడ నిర్మాణం చేపట్టినట్లు గుర్తించింది. ఆలయ అధికారులు పట్టుబట్టడంతోనే.. గోడ నిర్మాణంపై ముందుకెళ్లామన్న టూరిజం అధికారులు చెప్పారు. అలాగే పిల్లర్లు లేకుండా గోడ నిర్మించడంపై త్రిసభ్య కమిషన్‌ సభ్యులు ఇంజినీర్లను ప్రశ్నించారు.

Exit mobile version
Skip to toolbar