Site icon Prime9

CM Chandrababu: మహిళలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు!

CM Chandrababu speech in Swarnandhra- Swachchandra Program

CM Chandrababu speech in Swarnandhra- Swachchandra Program

CM Chandrababu speech in Swarnandhra- Swachchandra Program: కర్నూల్ జిల్లాలో పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ప్రజలకు కీలక పిలుపు ఇచ్చారు. స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి చంద్రబాబు హాజరై మాట్లాడారు.  రాష్ట్రంలో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని సీఎం తెలిపారు.

 

దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం మనదేనన్నారు. అన్ని నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. దీపం-2 కింద ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నట్లు తెలిపారు. డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. పాఠశాలలు తెరిచేలోగా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపాురు.

 

రాష్ట్రంలో పచ్చదనం పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇందుకోసం నెలలో ఒక రోజు కేటాయిస్తున్నామన్నారు. ఈ మేరకు అక్కడ ప్రజలతో ప్రమాణం చేయించారు. శుభ్రత కోసం నెలలో ఒక రోజు కేటాయిస్తున్నామన్నారు. ప్రతినెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై ప్రజలు దృష్టి సారించాలన్నారు. అలాగే ఉద్యోగులు సైతం మూడో శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు.

 

175 నియోజకవర్గాల్లో రైతు బజార్లను పెడతామని, గతంలో నేను రైతు బజార్లను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు కర్నూలులో రైతు బజారు కోసం రూ.6 కోట్లు కేటాయించి డెవలప్ చేస్తామని చెప్పారు. మేము తీసుకొచ్చిన రైతు బజార్లతో రైతులు ఎంతో లబ్ధి పొందుతున్నారన్నారు. రైతు బజార్లతో వినియోగదారులకు కూడా ఎంతో మేలు జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు.

 

ఇక, వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు రానున్నట్లు వెల్లడించారు. యోగా డేలో నరేంద్ర మోదీ పాల్గొననున్నట్లు తెలిపారు. ప్రపంచం మెచ్చేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. వేస్ట్ నుంచి విద్యుత్ తయారు చేయనున్నట్లు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar