Site icon Prime9

CEO Prime9 News P.Venkateswararao : టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్ధులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు – ప్రైమ్ 9 న్యూస్ సీఈవో పి. వేంకటేశ్వరరావు

CEO Prime9 News P.Venkateswararao words for ap 10th class students

CEO Prime9 News P.Venkateswararao words for ap 10th class students

CEO Prime9 News P.Venkateswararao : ఏపీలోని విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు జరిగిన విషయం తెలిసిందే. 18 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈఏపీ) ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ప్రైమ్ 9 న్యూస్ సీఈవో పి. వేంకటేశ్వరరావు విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన విద్యార్ధులు క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా.. మళ్ళీ బాగా చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని సూచించారు.

పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఫలితాల్లో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. టెన్త్‌ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి 5శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఈ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానం (87.4 శాతం ఉత్తీర్ణత) లో నిలవగా.. నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది (60 శాతం). అలానే ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. అదే విధంగా జూన్‌ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు వెల్లడించారు. మే 17వ తేదీలోపు సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తులకు ఆహ్వానం ఇవ్వాలని కోరారు.

నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూల్స్ కు, అత్యధిక శాతం మార్కులు సాధించిన స్టూడెంట్స్ కు , ఆ స్కూల్ టీచర్స్ ను పోత్సహించే విధంగా ప్రణాళికలను ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్స్ ఎటువంటి అఘాయిత్యాలు పాల్పడవద్దని.. పరీక్షలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కు స్పెషల్ కోచింగ్ ఇప్పిస్తామని మంత్రి బొత్సా పేర్కొన్నారు. విద్యా అకడమిక్ సంవత్సరం వెస్ట్ కాకుండా మళ్ళీ ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు.

ఏపీలో 933 పాఠశాలల్లో వంద శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 38 పాఠశాల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. ఈ ఏడాది ఫలితాల్లో టాప్ లో పార్వతీపురం మన్యం జిల్లా 85 శాతం ఉత్తీర్ణతతో ఉండగా.. లాస్ట్‌లో నంద్యాల జిల్లా 60.39 శాతంతో ఉంది. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ లో 95.25 శాతం ఉత్తీర్ణత నమోదఅయింది. 75.38 శాతం మంది బాలికలు పాస్ కాగా, 69.27 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే ఈసారి 5 శాతం ఉత్తీర్ణత పెరగడం విశేషం

Exit mobile version
Skip to toolbar