AP CM Chandrababu Review Meeting on Agriculture Department: రాష్ట్రంలో ఉత్పత్తి చేసే ప్యూర్ జ్యూస్ లపై జీఎస్టీ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో, తిరుమల తిరుపతిలో భక్తులకు ప్రసాదంగా మ్యాంగ్ జ్యూస్ అందించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. అలాగే రైతు సమస్యలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడుతానని స్ఫష్టం చేశారు.
పంటలకు గిట్టుబాటు ధరల నిర్దారణ, రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు, రైతు సమస్యలను పరిష్కరించేందుకుగాను సీఎం చంద్రబాబు నేడు సమీక్షనిర్వహించారు. పంటలు, ధరలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో కలిసి అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ ముందే తగిన ప్రణాళికలు చేసిందని పేర్కొన్నారు. డిమాండ్ ఉన్న పంటలే రైతులు సాగు చేసేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.
ముఖ్యంగా హెచ్డీ బర్లే పొగాకు మెట్రిక్ టన్నుకు రూ. 12 వేలు, కోకోకు కేజీకి రూ. 500 ధర చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కంపెనీల పంట కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మద్దతు ధర కన్నా తక్కువగా మార్కెట్ లో ధర రాయాల్సి వస్తే.. రైతులను నేరుగా సంప్రదించి వారిని ఆదుకోవాలన్నారు. పొగాకు రకాలను టొబాకో బోర్డులో చేర్చేందుకు కేంద్రంతో మాట్లాడుతానని చెప్పారు. ఈ ఏడాది హెచ్డీ బర్లే రకానికి క్రాప్ హాలిడే ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా వివరించారు. తద్వారా రైతులు నష్టపోకుండా చూసుకుంటామని చెప్పారు.