Prime9

Lashkar Terrorist: గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో ఖలీద్ ఖతం

Breaking News: గుర్తుతెలియని వ్యక్తులు లష్కరే తోయిబా టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ ను హతమార్చారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఇప్పటికే భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న టెర్రరిస్టు గ్రూపు సభ్యులను గుర్తుతెలియని వ్యక్తులు న్యూట్రల్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఖలీద్ హతమైనట్లు తెలుస్తోంది.

 

ఖలీద్ నాయకత్వంలో మూడు ప్రధాన దాడులు చేశాడు. 2001లో సీఆర్పీఎఫ్ పై, 2005లో బెంగళూరు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ పై దాడి, 2006లో నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడా చేశాడు. ఇతడు నేపాల్ కేంద్రంగా పనిచేస్తున్నాడు. అక్కడే వినోద్ కుమార్ పేరుతో చెలామని అయ్యాడు. స్థానిక మహిళ నగ్మాను పెళ్లి చేసుకున్నాడు. అక్కడినుంచే లష్కరే కార్యకలాపాలను సాగిస్తున్నాడు.

 

తాజాగా ఖలీద్ తన స్థావరాన్ని పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్సుకు మార్చాడు. అక్కడినుంచి లష్కరే దాని ప్రధాన సంస్థ జమాత్ ఉద్ దావా కోసం పనిచేస్తున్నాడు. కాగా, ఈరోజు గుర్తుతెలియని వ్యక్తులు ఖలీద్ ను కాల్చిచంపారు.

Exit mobile version
Skip to toolbar