Site icon Prime9

India-Pakistan : పాకిస్థాన్ పీఎంఓలో సమావేశం.. ఇస్లామాబాద్‌లో మోగిన సైరన్లు

India-Pakistan

India-Pakistan

Sirens blare in Islamabad : భారత్ సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో పాకిస్థాన్ యత్నించింది. దీంతో మన సైన్యం పాక్‌కు గట్టి సమాధానిచ్చింది. పాకిస్థాన్‌లోని ఆయా ప్రాంతాల్లో గగనతల రక్షణ రాడార్లు, వ్యవస్థలను టార్గెట్ చేసుకొని విరుచుకుపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని నగరం ఇస్లామాబాద్‌లో సైరన్ల మోత మోగింది. ఆ సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయంలో సమావేశం జరుగుతుండటం గమనార్హం.

 

పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి సమయంలో కొద్దిగంటల క్రితం పాక్ ప్రధాన నగరాలైన లాహోర్, కరాచీలో పేలుళ్ల శబ్దాలు వచ్చాయి. భారత్ పాక్ దాడుల యత్నాన్ని తిప్పికొట్టింది. లాహో‌ర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దెబ్బతీసింది. ఈ మేరకు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. తాజాగా పాక్ ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)లో సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఉన్నతస్థాయి మిలిటరీ అధికారులు పాల్గొన్నారు. సమావేశం జరుగుతుండగా సైరన్లు మోగాయి.

Exit mobile version
Skip to toolbar