Prime9

Earthquake: చైనాలో భూకంపం.. వణికిపోతున్న ప్రజలు

Earthquake in China, Magnitude 4.5: చైనాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రత నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఉదయం 6.30 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు తెలిపింది.

 

అయితే సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు సర్వే పేర్కొంది. ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం కలగలేదని చెప్పింది. కాగా, భూకంప తీవ్రతకు చైనాలోని పలు ప్రాంతాల ప్రజలు వణికిపోయారు. వెంటనే ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. చైనా దేశంలోని యునాన్ ప్రావిన్ ప్రాంతంలో ఇటీవల వరుసగా భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

 

మరోవైపు, అఫ్గానిస్తాన్ దేశంలో కూడా తెల్లవారుజామున భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 4 తీవ్రత నమోదనట్లు తెలిసింది. ఈ భూకంపం 1 గంట సమయంలో జరిగింది. దాదాపు 120 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అంతకుముందు  టర్కీ దేశంలోనూ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై  5.2 తీవ్రతతో భూప్రకంపటనలు వచ్చాయి. ఇప్పటివరకు ఈ భూకంపాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.

 

కాగా, తుర్కియోలో కూడా భూకంపం వచ్చింది. తుర్కియోలోని కొన్యా ప్రావిన్సులో ఉన్న కులు జిల్లాలో భూమి కంపించింది. సుమారు కులు ప్రాంతానికి 14 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపలనుల వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదైంది. ఈ ప్రభావంతో తుర్కియో క్యాపిటల్ అంకారాతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్లపాటు కదిలినట్లు స్థానికులు చెబుతున్నారు. భూప్రకంపనలు ఒక్కసారిగా జరగడంతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నష్టం కలగలేదని చెబుతున్నారు.

 

Exit mobile version
Skip to toolbar