Prime9

Mohmand Dam: పాకిస్తాన్ లో మొహ్మండ్ డ్యామ్ కడుతున్న చైనా

Mohmand Dam:  పహల్గామ్‌లో పాకిస్తాన్‌ టెర్రర్‌ దాడుల తర్వాత ఇండియా పాకిస్తాన్‌కు నీటి సరఫరాను నిలిపివేసింది. కొన్ని దశాబ్దాల కాలంగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సింధు జలాల పంపిణి ఒప్పందాన్ని ఇండియా తాత్కాలికంగా రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్‌ తన నీటి అవసరాలకు గాను చైనాను ఆశ్రయించింది.

 

చైనా ఖైబర్‌ఫక్తూన్‌ ఖ్వాలో చేపట్టిన మొహ్మండ్ డ్యామ్ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి పాక్‌ను ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ డ్యామ్‌ సింధునదిపై నేరుగా నిర్మించకపోయినా పాకిస్తాన్‌ నీటి భద్రతకు కీలకం కానుంది. తాజా పరిణామాల మధ్య ఇండియా – పాకిస్తాన్‌ల మధ్య నీటి యుద్ధం మొదలు కాబోతోంది. దీంట్లో పాకిస్తాన్‌ చైనాను లాగుతోంది. ఇక చైనా కూడా పాకిస్తాన్‌కు అండగా ఉంటానని సంకేతాలు పంపించింది.  ఈ డ్యామ్  భవిష్యత్తులో ఇండియా, పాకిస్తాన్‌, చైనాల మధ్య ముదిరే నీటి వివాదంగా కనిపిస్తోంది.

 

 

 

 

Exit mobile version
Skip to toolbar